పర్యవరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు.. ఇప్పుడు బైక్, ఆటో, కార్, బస్ లకే పరిమితం కాకుండా.. షిప్లో కూడా అందుబాటులోకి రానుంది..నీటి కాలుష్యాన్ని నివారించనుంది..! ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో డెన్మార్క్ & నార్వే మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు కొత్త టెక్నాలజీలపై నిరంతరం పరిశోధనలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే హైడ్రోజన్ శక్తితో కూడిన ఫెర్రీ షిప్ను అభివృద్ధి చేస్తున్నాయి.. ఫెర్రీ టైటానిక్ లా పెద్దదిగా ఉంది.. దీనిలో ఒకేసారి 1,800 మంది ప్రయాణించే సామర్త్యాన్ని కలిగి ఉంది.. ఈ షిప్ గురించి పూర్తి సమాచారం ఇలా..
సముద్ర రవాణా, వాతావరణ మార్పులను నివారించడంలో ఈ ప్రాజెక్టుకు ఉపయోగపడుతుందని ఇరు దేశాలు తెలిపాయి. ఈ దిగ్గజం ఫెర్రీ షిప్కు “యూరోపా సెవెజ్” అని పేరు పెట్టారు. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్ సహాయంతో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎటువంటి కాలుష్యం కలిగించదు.ఇది చాలా శక్తివంతమైనది. ఫెర్రీ షిప్ 1,800 మంది ప్రయాణికులను, 380 కార్లు, 120 ట్రక్కులను మోయగల సామర్థ్యం కలిగి ఉంది. ఫెర్రీ 23 మెగావాట్ల హైడ్రోజన్ సెల్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫెర్రీ నౌక ద్వారా ప్రతి సంవత్సరం 64,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.
హైడ్రోజన్ శక్తితో కూడిన ఫెర్రీ షిప్ డెన్మార్క్ రాజధాని నగరమైన కోపెన్హాగన్ నుండి నార్వేజియన్ రాజధాని ఓస్లో వరకు నడుస్తుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రెండు దేశాలు యూరోపియన్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం కోరుతున్నాయి. అనేక యూరోపియన్ దేశాలు 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనడానికి, విక్రయించడానికి చట్టాన్ని తీసుకువచ్చాయి. ఇటీవల, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పూణేలోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి కారును విజయవంతంగా నడిపింది. రాబోయే కాలంలో దాదాపు అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపాంతరం చెందనున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆటో కంపెనీలు కూడా దాదాపు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి.