పట్టువస్త్రాలు, ఆభరణాలు కాళ్లకు గజ్జెలు పెట్టుకుని పండగలకి శుభకార్యాలకు సందడి చేస్తే.. సాక్షాత్తు లక్ష్మీదేవి ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడి చేసుకుంటూ నడిచి వస్తున్నట్లు ఉంటుంది. ఇంతకు ముందు వెండిపట్టీలు, నిండైనమువ్వలతో తోకనిపించేవి . రాను రాను ఫ్యాషన్ ప్రపంచం లో ఈ ధోరణి మారింది. సన్నగా, నైస్గా, నాజూగ్గా ఉన్న పట్టీలు ఇప్పటి అమ్మాయిల కాళ్లకు వన్నె తెస్తున్నాయి.
వెండి పట్టీల స్థానం లో బంగాపు పట్టీలు, పూసల పట్టీల తో పాటు రకరకాల పట్టీలు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆక్రమించాయి . అయితే ఎన్ని రకాల పట్టీలు వచ్చినా వెండి పట్టీల ను మాత్రమే కాళ్ళకు ధరిస్తే మంచిదని అంటున్నారు పండితుల తో పాటు శాస్త్రవేత్తలు కూడా.
పంచలోహాలతో పట్టీలు, పచ్చటి పసిడితో చేసిన పట్టీలు అసలే ధరించ వద్దంటున్నారు. ఎందుకంటే బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మి దేవి గా భావిస్తాము. శ్రీ మహా లక్ష్మి కి ప్రతి రూపమైన బంగారం తో పట్టీలు చేయించుకుని కాళ్లకు పెట్టుకుంటే ఆమెను అవమానించినట్లవుతుందని, అవమానించిన చోట ఆవిడ ఉండకుండా వెళ్ళి పోతే కటిక దరిద్రులు అవుతారని అలా జరిగిన సంఘటనలు చాల ఉన్నాయి అని పండితులు అంటున్నారు. ఇక సైన్స్ పరంగా నూ పాదాల కు వెండి పట్టిలు పెట్టుకుంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
నడుము నొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి అంటున్నారు . అదే విధం గా మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది. అదే బంగారం తో తయారు చేసిన పట్టీ లై తే ఒంట్లో వేడి పుట్టి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి బంగారం వస్తువులు ఏవైనా మెడ, చేతులకు ధరి స్తేనే మంచిదని తెలియ చేసారు. బంగారం పూజ్యనీయమైంది. అందుకే కాళ్లకు ధరించి అవమానించకూడదు.అంతే కాదు ఆడవారు బంగారాన్ని కాళ్లకు ధరిస్తే వైవాహిక జీవితం లో కూడా సమస్యలు వస్తాయట. ఆరోగ్యం కూడా పడవవుతుంది అని అంటున్నారు.