ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే పుస్తకం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొర్రెల కాపరుల జీవితాన్ని అత్యంత అద్భుతంగా అక్షరీకరించారు రచయిత. ఈ పుస్తకం 2019లో తానా నవలల పోటీలో మొదటి బహుమతి పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా పురస్కారం ప్రకటించింది. దీంతో అసలు ఈ పుస్తకంలో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ ప్రయత్నం లోనే ఈ నవలకు ఆకర్షితుడయ్యాడు. అంతే ఏముంది దీనికి దృశ్య రూపాన్ని తీసుకొచ్చాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు చారిత్రాత్మక సినిమాలను తీసి తెలుగు తెరకు ఆణిముత్యాలు అందిస్తున్న క్రిష్.
ఇన్నాళ్లు సీక్రెట్ గా పెట్టిన ఈ కథను మొత్తానికి రివీల్ చేశాడు క్రిష్. వైష్ణవి తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ మూవీని ఆల్రెడీ కంప్లీట్ చేశాడు క్రిష్. ఈ పుస్తకం క్రిష్ పై ఎంత ప్రభావం చుపించిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా పక్కనపెట్టెంతలా అని తానే చెప్పారు క్రిష్. కొండ పొలం పుస్తకం చదువుతున్నపుడు తన ఎక్స్పీరియన్స్ ను తానే స్వయంగా చెప్పుకొచ్చాడు క్రిష్. కొండ పొలం పుస్తకం చదివిన తర్వాత అసలు కృషికి నిద్రపట్టలేదట. వేరే ఏ పని మీద దృష్టి పెట్టలేకపోయాడట. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం చదివిన తరువాత రెండు రోజుల పాటు నిద్ర పట్టలేదట. ఇక ఈ నవల ఆధారంగా సినిమాను తీయాలని డిసైడ్ అయ్యాడట.
అనుకున్నదే తడవుగా ఆ పుస్తకంపై రైట్స్ ని కొన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ ని సంప్రదించడం.. ఆ తర్వాత సినిమాను కూడా కంప్లీట్ చేయడం చక చకా జరిగిపోయాయి. అంతేకాదు ఈ సినిమాని ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ముందెప్పుడూ చూడని విధంగా రకుల్ ప్రీత్ సింగ్ మూవీ లో కనిపించనుంది. పక్కా రాయలసీమ అమ్మాయిగా అలరించనుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెంచేశాడు క్రిష్. ఈ సినిమాకి కొండపొలం అనే పేరే పెట్టేందుకు నిర్ణయించుకున్నాడట. త్వరలో ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.