NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏమిటి ? గార”డి”… ఈ తాత్కాలిక పట్టాలేలా జగన్ ??

ఇంటిపట్టాల పంపిణిలో కొత్త విషయం ఇది… ఎంతో విలువైన స్థలాలు పేదలకు ఇస్తున్నమని దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వలేని భారీ ఎత్తున పట్టాలు ఇస్తున్నామని చెప్పిన జగన్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందా..? లేక తిమ్మిని బమ్మి చేస్తుందా? మరి ఇంకేదైనా ఉందా..? రహస్య అజెండా అమలులో భాగమా? అబ్బో ఇంటి పట్టాల తంతులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు ఇప్పుడు ప్రభుత్వ నిజాయతీని ప్రశ్నిస్తున్నాయి… జగన్ చేస్తున్న వింత విషయాన్నీ బయటకు తీస్తున్నాయి…. అదేమిటంటే…

** జగన్ ఇంటి పట్టాల కార్యక్రమంలో జగన్ ఇచ్చిన ఆయన చిత్రంతో ఉన్న పట్టాను ఒకసారి గమనించండి… అది పక్క డి ఫామ్ పట్టా. అంటే తాత్కాలిక పట్టా. అంటే ఆ స్థలం మీద పేదలకు ఎలాంటి హక్కు ఉండదు… అన్న మాట. దీనికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే దానిపై హక్కు వస్తుంది… అరే మరి ఇదేంటి ఎలాంటి పట్టాలు ఇచ్చారు అని అడిగితే మాత్రం జగన్ ప్రభుత్వ పెద్దలు, అధికలురు ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే….. కోర్టు కేసులున్నాయి… అని…
** రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన అన్ని స్థలల మీద కోర్టు కేసులు లేవు అన్నది గుర్తించాలి. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 10 శాతం స్థలాలపై కేసులు… వివిధ లీగల్ అడ్డంకులు, స్టే లు ఉన్న మాట వాస్తవమే… వాటిని ఎవరు వేయించారు.. కోర్టుల వరకు ఎవరు వెళ్లారు.. ఎందుకు ఏమా కథ అనే దానిలోకి వెళ్తే పెద్ద విషయం. దానిలోకి వెళ్లకుండా చూస్తే … ప్రభుత్వం చెప్పినట్లే 10 శాతం స్థలాల కు సంబంధించి మాత్రమే.. వివాదం ఉన్న చోట మాత్రమే డి ఫామ్ పట్టా ఇవ్వాలి. మిగిలిన చోట సీఎం చెప్పినట్టు రిజిస్టేషన్ పట్టా ఇవ్వాలి. ఇది సహేతుకం… కానీ జరుగుతున్నది వేరు కదా…
** ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు పంపిణీని ప్రతిపక్ష పార్టీలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు అని చెబుతూ ప్రభత్వం వచ్చింది.. పలు థఫాలుగా వాయిదాలు వేసింది. కోర్టులలో కేసులు కావాలని వేశారు అని చెప్పారు. అయితే చివరకు కేవలం 10 శాతం భూముల మీదనే కేసులు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది.. దానిలో కూడా వాస్తవంగా చూస్తే కేవలం 4% భూములు పైన మాత్రమే కేసులున్నట్లు తెలుస్తోంది.


** క్రిస్మస్ రోజున ముహూర్తం పెట్టి వరుసగా 15 రోజులు పాటు 30,75,000 పట్టాల పంపకం అంటూ చెప్పి మొదటిగా 20,00,000 ఇళ్ళ పట్టాలు, తరువాత వాటిని క్రమేణా 25,00,000 చేసి, చివరకు 30,00,000 అంటూ ఇప్పుడు 30,75,000 చేసారు. అయితే అన్ని చోట్ల అధికారులు చెప్పే మాట
ఈ విషయం కోర్టు పరిథిలో ఉన్నందున డి.ఫారం పట్టా మాత్రమే ఇస్తామని, రిజస్ట్రేషన్ కోర్టు తీర్పు తరువాత ఇస్తామని చెబుతున్నారు.
** ఇవి ఉత్తుత్తి పట్టాలే అని తెలుస్తోంది. వీటిని తరువాత వచ్చే ప్రభుత్వం అంగీకరించక పోతే, నష్టపోయేది ఎవరు ..? అప్పుడు వచ్చే ప్రభుత్వాలు వీటిని అనుమతించేది లేదని చెబితే ప్రజల్లో వచ్చే వ్యతిరేకలతకు ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ప్రశ్న.
** ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, కేవలం 10% భూములు మాత్రమే కోర్టులో వివాదం ఉన్నదని. అంటే షుమారుగా 3,07,500 పట్టాలు వివాదంలో ఉన్నాయి. వాటి వరకు డి.ఫారం ఇచ్చి, మిగిలిన మొత్తం ఇళ్ళకు సరైన పట్టాలతో రిజిస్ట్రేషన్ చేయవచ్చు కదా? ఏవరు అడ్డం పడుతున్నారు? ఏందుకు ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు?
దీనిలో తర్వాత ఏమైనా తేడాలు వచ్చిన… వచ్చే ప్రభుత్వాలు కొర్రీలు పెట్టిన నష్టపోయేది పేదోడు….

రాజకీయాలలోకి ప్రభుత్వ పట్టాల పంపిణి తీసుకువెళ్తే… తర్వాత వచ్చే చిక్కులు , నష్టాలను ఎవరు భరించాలి.. ? ఎందుకు ఈ ముసుగులో పట్టాల పంపిణి ఆట అన్నది ప్రభుత్వమే చెప్పాలి… రిజిస్ట్రేషన్ కు రాష్ట్రవ్యాప్తంగా అడ్డంకులు ఏవి లేవని ఏమైనా లీగల్ ఇబ్బందులు వస్తే దానికి సమాధానం చెప్పేది ఎవరు???

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju