జ్ఞానం, నైపుణ్యాల కలయిక మేధస్సు. అదే మానవాళిని అతి శక్తిమంతమైన జీవిగా తీర్చిదిద్దింది.మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వికుల నుంచి సంక్రమించిందే.కానీ ఇప్పుడు మనకంప్యూటరింగ్ పవర్తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన మేథా శక్తిని కోల్పోతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ అనే ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం. ప్రస్తుత యువత సంగతి అయితే మరీ ఎక్కువ.
జీవితాలను సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు.. అయితే టెక్నాలజీకి మాత్రం బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీ సాయం తీసుకోవాలి, ఏ సమయం లో తీసుకోకూడదు అని నిర్ణయించుకోవాలి. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ముప్పు ఉంది. దీని పైన జరిగిన ఓ సర్వే తెలియచేసిన వివరాల ప్రకారం,టెక్నాలజీ కి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనాశక్తిని కోల్పోయి..రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని తెల్పింది.
మరి మన సహజసిద్ధమైన మేధాశక్తి పెరగడానికి ఏమి చేయాలి?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలగురించి తెలుసుకుందాం.. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల పై, వస్తువుల పై, ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్లోవెతుక్కునే పని లేకుండా తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకొనేలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఉండే నగరం లేదా పట్టణంగురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.
కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తు పెట్టుకోవాలి. మనకు ఆప్తులు అనుకునే వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకే సారి ఇదంతా చేయలేకపోవచ్చు. నెమ్మదిగా అయినా సరే.. మనకు మన పూర్వికులు అందించిన సహజ సిద్ధమైన మేధాశక్తి ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలి. మెదడుకు మేత పెడితే అది ఉత్సహం గా పనిచేస్తుంది అని మరువకండి..