ఏపీ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క అధికార పార్టీ నేతలు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిగే సమయంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వద్ద ఇటువంటి ఘటనలు జరగటం, ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్ర అని అభివర్ణిస్తున్నారు.
ఇప్పటికే రామతీర్థం వద్దకి చాలా మంది పార్టీ నేతలు వెళ్ళటంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నికలు గురించి ప్రస్తావిస్తూ.. జరగబోయే ఎన్నికలలో బైబిల్ పార్టీ కావాలా..? లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా..? అనే కామెంట్ చేయడం జరిగింది.
దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ నేతలు దిమ్మతిరిగే కౌంటర్ రెడీ చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబడతారని ఇరు పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. అప్పట్లో తిరుపతి సాక్షిగా తన కూతురు క్రిస్టియన్ అని ప్రకటించటం అందరికీ తెలిసిందే. దీంతో క్రైస్తవ్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని, తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ రెడీ అవటం లో తప్పు లేనప్పుడు.. వైసీపీ పార్టీ పై మత ముద్ర వేయడం ఏంటి అన్న తరహాలో బండి సంజయ్ ని కడిగే యటానికి వైసీపీ పార్టీ నేతలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం మతాల పేర్లు చెప్పి రాజకీయ లబ్ది పొందడానికి బండి సంజయ్ బైబిల్ పార్టీ .. భగవద్గీత అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మతాలు పేర్లు చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఆంధ్ర వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు కాదు అని, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆంధ్ర ఓటర్లకు బాగా తెలుసు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.