ఈ తీరిక లేని జీవితంలో మనిషికి విశ్రాంతి లేకుండా పోతుంది. కానీ విరామం లేకుండా పని చేయడం ఆరోగ్యానికిచాల ప్రమాదమట . ఈ రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. అయితే.. పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే విశ్రాంతి తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు.
విశ్రాంతి తీసుకోవడం అంటే మనకు తెలిసి నిద్రపోవడమే ఎందుకంటే నిద్రపోయి లేవడం అంటే మనం శారీరంగానూ, మానసికంగానూ విశ్రాంతి పొందినట్టు గా ఉంటుంది. లేదంటే టీవీ లోనో, ఫోన్ లోనో ఏదో నచ్చిన ప్రోగ్రాంచుస్తూఉండడం వలన ఉపశమనం లభించింది అనుకుంటాం. కానీ ఇక్కడ నిజమేంటంటే సోషల్ మీడియా, టీవీ వల్ల మనం మన మైండ్ కు మరింత పని పెట్టినట్టు అవుతుందట.అసలు విశ్రాంతి అంటే ఏంటి.. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది కొందరు నిపుణులు చెబుతున్నారు. వాటిగురించి తెలుసుకుందాం.
శారీరక విశ్రాంతి కావాలి అంటే కొంచెం సేపు పడుకోవడం లేదా విశ్రాంతి గా ఉంటూ బాగాఇష్టమైన పని చేస్తూ ఉండాలి.భావోద్వేగ విశ్రాంతి అనగా… మన మనసులో ఉన్న భావోద్వేగాల ను కొద్దిసేపు మరిచిపోవాలి. అది కాదంటే వాటిని మనకు బాగా ఆప్తులైనవారితో పంచుకోవడం అని వైద్యులు చెబుతున్నారు. సామాజిక విశ్రాంతి అంటే సోషల్ రెస్ట్. ఇది మనల్సి మనం పరిశీలించుకోవడం.మన గురించి మనం తెలుసుకోవడం.దీని కోసం మన దగ్గరి వ్యక్తినో, గురువుగారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం చేయాలట. ఇంద్రియ విశ్రాంతి లో
ఇంద్రియాలపై పడే ఒత్తిడిని దూరం చేసుకోవడమే సెస్సరీ రెస్ట్ అంటారు. ఇందుకోసం మనం మన ఎలక్ట్రానికి డివైసెస్ అన్నింటికి దూరం గా ప్రశాంతంగా ఉండటం. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడం లాంటివి చేస్తే బావుంటుందట. దీని వలన మన ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ఆధ్యాత్మిక విశ్రాంతి అంటేఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్లొనడం వల్ల మన మెదడకు కాస్త విశ్రాంతి కలుగుతుండి. అయితే.. ఇది అందరికీ ఇష్టమైన విషయం కాదు,దీనికి బదులుగా యోగా వంటివి చేసుకోవడంలేదా ఇతరులకు నేర్పించడం వంటివి చేస్తే మానసిక, శారీరక విశ్రాంతిని పొందవచ్చట.