NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

జగన్ తో ఒపెన్ ఫైట్ మొదలు పెట్టిన కేసిఆర్..మోడి దిగినా ఆగేదిలేదంటున్నాడు..

ఏపి Andhra Pradesh ముఖ్యమంత్రి cm వైఎస్ జగన్ మోహనరెడ్డి ys jaganmohan reddy, తెలంగాణ telangana ముఖ్యమంత్రి cm కెసిఆర్ kcr మద్య సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి ఇటీవల కాలం వరకూ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఏపిలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ycp అధికారంలోకి రావడానికి తన వంతు కెసిఆర్ సహాయ సహకారాలు అందించారని పేరుంది. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ వచ్చారు. ప్రగతి భవన్ లో జగన్ విందుకు వెళ్లారు. అక్కడి కాళేశ్వరం kaleswaram ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లి వచ్చారు. ఇద్దరిది గురు శిష్యుల బంధం అని అందరూ అనుకున్నారు.

జగన్ తో ఒపెన్ ఫైట్ మొదలు పెట్టిన కేసిఆర్..మోడి దిగినా ఆగేదిలేదంటున్నాడు..
jagan vs kcr krisha bord issue

ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు

ఇద్దరి మధ్య స్నేహసంబంధాల నేపథ్యంలో హైదరాబాదు Hyderabad లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పలు భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి జగన్ అప్పగించేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటే సాగునీటి సమస్యలతో పాటు ఇతర విభజన చట్టంలోని సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అందరూ భావించారు. కానీ ఇద్దరి మద్య ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ కరోనా corona లాక్ డౌన్ కు ముందు నుండి పేచీలు మొదలు అయ్యాయి. రాయలసీమ rayalaseema ఎత్తిపోతల పథకానికి జగన్ నిధులు మంజూరు చేసినప్పటి నుండి వివాదం తారాస్థాయికి చేరింది. ఏపిలోని ప్రాజెక్టులపై కెసిఆర్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడం, అక్కడి ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేసుకోవడం వరకూ వెళ్లాయి.

విశాఖలో కృష్ణా బోర్డులో ఏపి నిర్ణయం

ఇప్పుడు తాజాగా జగన్మోహనరెడ్డి తీసుకున్న మరో నిర్ణయాన్ని కెసిఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. త్వరలో (కోర్టు వివాదాలు పరిష్కారం కాగానే) పరిపాలనా రాజధాని విశాఖకు తరలిస్తున్నందున కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డును కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. విశాఖలో కార్యాలయం ఏర్పాటు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఎస్‌సి మురళీధర్ లేఖ రాశారు. బోర్డును ఏపి ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే తాము గతంలో ఒపుకున్నామనీ, ఇప్పుడు కృష్ణానదికి సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అపెక్స్ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా ఇప్పుడు విశాఖలో బోర్డు ఏర్పాటు చేస్తామనడం తగదని పేర్కొంటోంది.

జగన్ నిర్ణయానికి మోకాలడ్డుతున్న కెసిఆర్ సర్కార్

ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలకు కోర్టుల నుండి బ్రేక్ లు పడుతూ రాగా ఇప్పుడు కృష్ణాబోర్డు విషయంలో కెసిఆర్ నుండి బ్రేక్ పడుతోంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విషయంలో కెసిఆర్ వెనక్కు తగ్గరు. అదే మనస్థత్వం ఏపి సీఎం జగన్‌లోనూ ఉంది. విశాఖలో కృష్ణా బోర్డు ఏర్పాటునకు కేసిఆర్ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఈ పంచాయతీ కూడా కేంద్రం వద్దకు తీసుకువెళతాయా లేక చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయా అనేది వేచి చూడాలి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju