NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

టోటల్ మెలిక పెట్టిన వై ఎస్ జగన్ – నిమ్మగడ్డ వెనకడుగు – వైసీపీ ఘనవిజయం ?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా వ్యవహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మరో పక్క ఉద్యోగ సంఘాలు ఎన్నికలను నిర్వహించలేమని అంటున్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలకు సహకరించకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఉద్యోగులకు నిమ్మగడ్డ హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీం కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పుఎం ఇచ్చింది. కాకపోతే నోటిఫికేషన్ సమయంలో నిమ్మగడ్డ చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఎన్నికలకు బ్రేక్ పడేలా చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 3 లక్షల మంది కొత్త ఓటర్ల రూపంలో కొన్ని చిక్కులు రాబోతున్నాయి.

వాస్తవానికి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని నిమ్మగడ్డ స్వయంగా చెప్పారు.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఓటర్ల జాబితా ఇవ్వడంలో విఫలం అవ్వడం వల్ల, ఎన్నికల సంఘానికి సహకరించకపోవడం కారణంగా 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలా చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ అదే సమయంలో పాత జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడం వల్ల దాదాపు 3.6 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయారని కూడా చెప్పారు నిమ్మగడ్డ. ఇప్పుడు ఇదే పాయింట్ అధికార పార్టీకి అస్త్రంగా మారింది. కొందరు ఇప్పటికే ఈ అంశాన్ని ఉదహరిస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ నూ దాఖలు చేశారు. నిమ్మగడ్డ చెప్పిన ఈ అంశమే ఇప్పుడు ఎన్నికలకు బ్రేక్ వేసేందుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహణ.. నోటిఫికేషన్ అంశాలే చూసిన కోర్టులకు ఇప్పుడు కొత్త ఓటర్ల రూపంలో మెలిక వచ్చింది.

ప్రభుత్వానికి, ఎన్నికల సంఘంకు మద్య ఏర్పడిన వివాదం కారణంగా తామెందుకు ఓటు హక్కు కోల్పోవాలని పేర్కొంటూ పిటిషన్ లు దాఖలు చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. సోమవారం ఓ న్యాయవాది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లు హైకోర్టులో బుధవారం విచారణకు రానున్నాయి. మరో పక్క ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju