హైదరాబాదు, మార్చి 14: దివంగత దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ గురువారం వైసిపిలో చేరారు. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైసిపి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టీలో చేరానని అరుణ్ తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పార్టీ తరపున ప్రచారం చేస్తానని అరుణ్ వెల్లడించారు.
ఇప్పటికే సినీ రంగం నుండి ప్రముఖ హాస్య నటుడు ఆలీ, రాజా రవీంద్రలు వైసిపిలో చేరారు.