NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

TDP : చంద్రబాబును బహిష్కరిస్తున్నారు!

TDP : తెలుగుదేశం తరఫున పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తాం… ఇది కర్నూలు జిల్లా టిడిపి నేత భూమా అఖిలప్రియ మాట. ఎన్నికల్లో పోటీ చేయకుండా వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా… గుడివాడ నియోజకవర్గం లోని నందివాడ మండలం టిడిపి జడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ కుమారి ఆవేదన ఇది. తెలుగుదేశం తీసుకున్న పరిషత్ ఎన్నికల బహిష్కరణ ఆ పార్టీ ఉనికికె ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

TDP
TDP

చంద్రబాబు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో టిడిపి తరఫున పోటీ చేయాలని భావించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు జిల్లాల్లో భారీగా అధికార పార్టీ లోకి వలసలు ఊపందుకున్న అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చెబుతున్న కారణాలు ఆ పార్టీ నేతలకే సహేతుకంగా అనిపించడం లేదు.

ఇటు రాయలసీమ లోను, అటు కోస్తా జిల్లాల్లోనూ పార్టీని విడిచి వెళ్లిపోవాలని ఎప్పటినుంచో భావిస్తున్న నేతలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సాకుగా చూపి బయటకు రావడానికి మంచి మార్గంగా ఈ సమయాన్ని వాడుకుంటున్నారు. దిగువ స్థాయి కార్యకర్తలు సైతం పార్టీని వీడి, బయటకు రావడమే ఉత్తమం అనే కోణంలో భారీగా ఇతర పార్టీల వైపు వెళుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీలోకి కార్యకర్తలు వెళ్లేందుకు సుముఖత చుపుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా పరిషత్ ఎన్నికలు బహిష్కరించడం అనేది చారిత్రాత్మక తప్పిదం గా టిడిపి అభిమానులు భావిస్తున్నారు. దీనివల్ల పార్టీ ప్రభావం కోల్పోతుంది అని చంద్రబాబే ఒప్పుకున్నట్లే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క మొన్నటివరకు టిడిపి కి అనుకూలంగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నా రాని ఫలితాలు, ఇప్పుడు న్యాయ బద్దంగా అసలు రావు అనేది టీడీపీ బయట పెట్టుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో పోటీ నుంచి వైదొలగడం అనేది సాధారణ కార్యకర్తలు ఎవ్వరూ ఇష్టపడరు. ఒక్కోసారి ఓటమి రావొచ్చు కానీ పోటీ నుంచి పూర్తిగా బయటకు రావడం అనేదాన్ని మాత్రం సహించారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పూర్తిగా తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. దీంతో పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థులంతా ఎవరికి వారే తమ తమ ప్రచారం చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని ఏకపక్షంగా నే ముందుకు వెళ్తున్నారు. దింతో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పార్టీ నేతల నుంచి మరో పక్క కార్యకర్తల నుంచి ఎన్నికల బహిష్కరణ మీద వ్యతిరేకత తీవ్రంగా రావడంతో టీడీపీ అధిష్టానం కొత్త రాగం అందుకుంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడైనా పోటీలో కొనసాగాలని టీడీపీ నేతలు భావిస్తే, దానికి పార్టీ అభ్యంతరం చెప్పకూడదని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసి, పార్టీ నాయకులను కార్యకర్తలను చల్లబరిచే ప్రయత్నానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

Related posts

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!