NewsOrbit
జాతీయం న్యూస్

Farmers: 12 ప్రతిపక్ష పార్టీల అండతో మళ్లీ కదం తొక్కనున్న కర్షకులు!ఢిల్లీ దద్దరిల్లే సూచనలు!!

Farmers: కర్షకులు మళ్లీ కదం తొక్కనున్నారు. వారికి 12 ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.ఢిల్లీ శివార్లలో చేస్తున్న ఆందోళనలకు ఆరు నెలలు నిండటంతో ఈనెల 26వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే ఎం)అదే రోజున దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని రైతులకు పిలుపు నిచ్చింది.

Farmers are going to fight again with the support of 12 opposition parties!
Farmers are going to fight again with the support of 12 opposition parties!

వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఈ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్డే నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం,వీరి ఆందోళనలలో కొందరు సంఘవిద్రోహ శక్తులు చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకోవటం విదితమే.ఆ తరువాత ఇంటర్నెట్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించటం, పలువురు రైతు నేతలను గృహనిర్బంధం చేయడం, వారి ఆందోళనలపై ఉక్కుపాదం మోపడం కూడా జరిగింది.వీటన్నింటినీ నిరసిస్తూ రైతులు మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైపోయారు.

ఏయే పార్టీలు మద్దతిచ్చాయ౦టే!

సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల విజ్ఞప్తి మేరకు పన్నెండు ప్రతిపక్ష పార్టీలు ఇరవై ఆరో తేదీనాటి ఆందోళనకు మద్దతు ఇస్తూ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ,సిపిఐ ,సిపిఎం, ఎన్సీపీ,జనతాదళ్ సెక్యులర్,తృణమూల్ కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,డిఎంకె,శివసేన, సమాజ్వాదీ పార్టీ,జార్ఖండ్ ముక్తి మోర్చా , రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల అగ్ర నాయకులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

Farmers: అసలు ఆందోళన ఎందుకంటే !

గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇవి రైతులను నష్టపరిచేవిగాను ,కార్పోరేట్ సంస్థల కు లబ్ధి చేకూర్చేవిగాను ఉన్నాయంటూ వారు ఆందోళన చేపట్టారు.వేలాది మంది రైతులు ఢిల్లీలో పగలు రాత్రి చలి ఎండ వాన తేడాలేకుండా ఆరు నెలలుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.అయినా కేంద్రప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడంతో మరోసారి వారిలో ఆగ్రహజ్వాల ప్రజ్వరిల్లింది.

ఆ రోజే బ్లాక్ డే ఎందుకు?

కాగా ఈనెల ఇరవై ఆరో తేదీని సంయుక్త కిసాన్ మోర్చా బ్లాక్ డేగా ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉంది.రెండోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే ఇరవై ఆరోవ తేదీనే కావడంతో ఆ రోజును మోర్చా ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రైతులకు తోడు పన్నెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి ఆందోళనను నిర్వహిస్తుండటంతో ఈసారి ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?