Anandaiah Medicine: ప్రపంచ దేశాలను తల్లకిందులు చేసిన కరోనా మహమ్మారి కి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాని పరిస్థితి. వ్యాక్సిన్ వేసుకుంటున్న గాని అనేకమంది కరోనా బారిన పడుతూ మరణిస్తున్నారు. అదేరీతిలో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా గానీ రకరకాల అపోహలు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా కరోనా బారిన పడి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి మరణానికి అంచున ఉన్న వారిని సైతం లేచి నిలబెట్టింది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య నాటు మందు.
దీంతో ఈ మందు గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం తెలిసిందే. తాజాగా ఈ నాటు మందు పై ప్రభుత్వం ఐసీఎమ్ఆర్ అధికారుల ద్వారా పరీక్షలు చేయించి అధ్యయనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఆనందయ్య మెడిసిన్ విషయంలో అది సరైన విధానం కాదని.. భయపెట్టే రీతిలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మెడిసన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య మెడిసన్ ఇతర మందులతో హాని లేదని నివేదికలో తేలడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిసిఆర్ఎఎస్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.