Veera Brahmendra Swamy Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాధిపత్యం చిక్కుముడిగా మారింది. ఈ పర్యాయం తమకు అవకాశమివ్వాలంటూ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య రంగంలోకి దిగడంతో “పీఠముడి ” బిగిసింది.మఠం సాంప్రదాయం ప్రకారం గత ఏడుతరాలుగా స్వామివారి పెద్దకుమారుడికి మతాధిపత్యం ఇచ్చారు.కానీ స్వామివారి వీలునామా ప్రకారం ఈసారి తన కుమారుడికి పీఠాధిపత్యం ఇవ్వాల్సి ఉంటుందంటూ ఆయన రెండో భార్య మహాలక్ష్మీ వాదన లేవనెత్తింది.ఈ నేపధ్యంలో ఎనిమిది మంది పీఠాధిపతులు వివాదం పరిష్కారానికి నడుం బిగించారు.
Veera Brahmendra Swamy Matam: మఠంలోనే పీఠాధిపతుల మకాం!
ఈ ఎనిమిది మంది పీఠాధిపతులు రెండురోజులపాటు వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలోని మకాంచేసి అన్ని వర్గాల వాదనలు విన్నారు.శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి సంతానాన్ని ఒక్కొక్కరుగా పిలిచి మాట్లాడారు.ఆయన రెండో భార్య మహాలక్ష్మితో కూడా చర్చలు జరిపారు.కందిమల్లయ్యపల్లి గ్రామస్తుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.అన్ని కోణాల నుండి ఈ సమస్యను వారు అధ్యయనం చేశారు.
పీఠాధిపత్యానికి వీలునామా చెల్లదు!
పర్యటన ముగించుకొని వెళ్లే ముందు పీఠాధిపతులు మీడియాతో మాట్లాడారు.బ్రహ్మంగారి మఠం చరిత్రలో వీలునామా ప్రకారం తదుపరి పీఠాధిపతి ఎంపిక ఎక్కడా జరగలేదని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. స్వామి వారి ఆస్తుల విషయంలో వీలునామాలు చెల్లుతాయి కానీ…పీఠాధిపతి ఎంపిక విషయంలో అది చెల్లదని స్పష్టం చేశారు.బ్రహ్మాం గారి మఠం ప్రతిష్ట దిగజార్చకుండా ఉండేలా పీఠాధిపతి ఎంపికజరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు వివరించామని, వివాదాలకు వెళ్లవద్దని సలహా ఇచ్చామని తెలిపారు.వారసత్వమే పీఠాధిపతులుగా ఉండాలని మెజారిటీ వర్గం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల్లో ధార్మిక పరిషత్ ,దేవాదాయ శాఖలకు తమ నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు.అతి త్వరలోనే పీఠాధిపతి ఎంపిక పూర్తి చేసి రంగరంగ వైభవంగా పీఠాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.
ఇంత సులువుగా పీటముడి వీడేనా?
మఠాధిపతుల మాటలను బట్టి చూస్తే పీఠాధిపత్యాన్ని రెండో భార్య తరపు వారికి ఇచ్చే సూచనలు గోచరించడం లేదు.స్వామివారి మొదటి భార్య పెద్ద కొడుక్కేఈ పీఠాధిపత్యం దక్కేలా ఉంది.ఇదే జరిగితే రెండో భార్య మౌనంగా వుంటుందా? ఆమె కోర్టుకు వెళ్లకుండా వుంటుందా అన్నదే ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలు.ఏం జరుగుతుందో చూడాలి.