Mumbai: ముంబై Mumbai ఫస్ట్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్ సెకండ్.. వేవ్ లో చిగురుటాకులా వణికిపోయింది. మహారాష్ట్రలో రోజుకి వేలల్లో కేసులు నమోదైన సమయంలో దేశంలో మరెక్కడా వైరస్ విజృంభణ లేదు. దీంతో కేంద్రం కూడా పెద్దగా అలెర్ట్ కాలేదు. కానీ.. పరిస్థితి చాపకింద నీరులా మారి దేశం మొత్తాన్ని కుదిపేసింది. వెంటనే కఠిన చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటి బహిరంగ ప్రదేశఆల్లో మాస్క్ ధరించకపోతే ఫైన్ విధించడం ఒకటి. ఇలా దేశంలోని ఓ నగర ప్రజలు ఏకంగా 58కోట్లు ఫైన్ల రూపంలో కట్టారంటే నమ్మగలామా..? కానీ.. ఇది నిజం.
మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరిగిపోయి.. అమరావతి, పూణె, నాగ్ పూర్ వంటి ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్లు విధించింది ప్రభుత్వం. అప్పటికి ముంబైలో లాక్ డౌన్ లేకున్నా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ముంబై నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇందులో అందరూ మాస్క్ పెట్టుకోవాలనే నిబంధన ఒకటి. దీనిని కఠినంగా అమలు చేయమని.. ఉల్లంఘించిన వారి నుంచి జరిమానా విధించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆంక్షలను కఠినంగానే అమలు చేశారు. ఎంతగా అంటే.. ఒక్క ముంబై నగరంలోనే.. మాస్కులు పెట్టుకోని ప్రజల నుంచి ఏకంగా.. 58కోట్లు ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ఈ విషయాన్ని బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
Read More: Fevicol: ‘ఫెవికాల్’ క్రియేటివిటీ..! కోకాకోలా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంది..!
ఈస్థాయిలో నగదు వసూలు కావడం సంచలనం రేపుతోంది. ఇలా మాస్కులు ధరించని ప్రజల నుంచి ఫైన్లు వసూలు చేయడంలో ముంబై పోలీసులు, రైల్వే పోలీసులు కీలకంగా వ్యవహరించారు. ఈ 58 కోట్లు కూడా జూన్ 23 వరకూ వసూలైన మొత్తంగా అధికారులు వెల్లడించారు. వ్యక్తిగత రక్షణ, వ్యవస్థలను కాపాడటం అనే అంశంలో ప్రజల నిర్లక్ష్యానికి ఈ భారీ జరిమానా నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య గణణీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో 51,667 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,329 మంది ప్రాణాలు కోల్పోయారు. 64,527 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.