AP CM YS Jagan: కోవిడ్ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్న ఆక్రోషంతో ఆక్సిజన్ అందక చనిపోయారంటూ ఓ పత్రిక తప్పుడు రాతలు రాసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఆసుపత్రిల్లో 70 శాతంపైగా ఆక్సిజన్ బెడ్ లు ఖాళీగా ఉన్నాయి. 70 శాతం వెంటిలేటర్ లు అందుబాటులో ఉన్నాయి.
Read More: YS Sharmila: ఏపి, తెలంగాణ నీటి పంచాయతీపై వైఎస్ షర్మిల స్పందన ఇదీ..!!
ఇటువంటి పరిస్థితిలో ఆక్సిజన్ అందక చనిపోయారని నిసిగ్గుగా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశంగా కనబడుతోందన్నారు. ఇంత మంది అదికారులు టైమ్ పాస్ కాకుండా ఇక్కడ కూర్చున్నామా అని ప్రశ్నించారు. కోవిడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్న భావనగా ఉందన్నారు.
మంచి పేరు అనేది నా ఒక్కడికి రాదు, అందరం కలిసి కట్టుగా దీనిపై దృష్టి పెట్టడం వల్ల వస్తుందన్నారు. ఈ క్రెడిట్ నా వ్యక్తిగతం కాదన్నారు. మన దగ్గర మొదలు కొని కలెక్టర్లు, ఆశావర్కర్లు, కలెక్టర్ లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకూ అందరదీ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని దానికి వక్రభాష్యాలు చెప్పి దాన్ని ట్విస్ట్ చేసి రాస్తున్నారంటే ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉద్దేశం కనబడుతోందని అన్నారు.