KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన ఎత్తుగడలకు పదును పెడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ దూసుకుపోతున్న నేపథ్యంలో హుజురాబాద్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయనున్నారు అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపించినా.. కేసీఆర్ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఈ క్రమంలో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నట్లు సమాచారం.
Read More: KCR: మోత్కుపల్లికి కేసీఆర్ కండువా కప్పేది అందుకేనా?
హుజురాబాద్ లో ఉత్కంఠ
హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అభ్యర్థిగా బరిలోదింపుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేసీఆర్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు అయిందనే టాక్ ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఓ ఎన్నారై పేరు సైతం వినిపిస్తోంది. ఇంతేకాకుండా ఓ బీసీ నేత పేరు సైతం చక్కర్లు కొడుతోంది.
Read More : KCR: తెలంగాణకు ఇంకో ప్రత్యేక రికార్డు సొంతం చేయించిన కేసీఆర్
కేసీఆర్ గేమ్ ఏందంటే..
హుజురాబాద్ లో బీసీ ఓట్లు 1.02 లక్షలు ఉండగా.. ఓసీ ఓటర్లు 40 వేలు, ఎస్సీ ఓటర్లు 52 వేల మంది ఉన్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఈ సారి కూడా హుజురాబాద్ లో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత బంధు పథకంతో ఎస్సీలను ఆకర్షించడం ద్వారా ఆవర్గం ఓట్లు కూడా టీఆర్ఎస్ ఉంటాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతోఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లు రెడ్డి ఓట్లు,ఎస్సీ ఓట్లు గంపగుత్తుగా కారుకే పడతాయని ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.