Allu Arjun: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాని దింపుతున్నారు. దీంతో పుష్ప లో ప్రతి సన్నివేశం అందరినీ ఆకట్టుకునే రీతిలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ తో మూడో సినిమా కావటంతో.. “పుష్ప” పై బన్నీ ఫ్యాన్స్ బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్-అల్లు అర్జున్-దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే కచ్చితంగా ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్ అని అందరికీ తెలుసు.
గతంలో ఈ కాంబినేషన్ లో ఆ అంటే అమలాపురం, రింగ రింగా రింగా రింగా.. ఐటం సాంగులు అభిమానులను ఎంతగానో అలరించాయి. అయితే పుష్ప పాన్ ఇండియా మూవీ కావటంతో సరికొత్త ట్యూన్స్ తో ఆల్రెడీ దేవి సాంగ్ ఇవ్వటం జరిగిందట.. హైలెట్ అన్నట్టు ఇండస్ట్రీ నుండి అందుతున్న టాక్. ఇటువంటి తరుణంలో ఈ ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ సరసన అందరికీ తెలిసిన హీరోయిన్ చేత స్టెప్పులు వేయించాలని సుకుమార్ డిసైడ్ అయ్యారట.
Read More: Pushpa : పుష్ప తర్వాత బన్ని ఫిక్సైందా ఆ డైరెక్టర్కేనా..?
ఈ నేపథ్యంలో మొదటిలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, దిశా పటాని పేర్లు వినిపించగా తాజాగా సన్నీ లియోన్ కి సుకుమార్ ఓకే చెప్పినట్లు ఆమె చేత స్టెప్పులు వేయించడానికి బన్నీ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. గిరిజన అమ్మాయిగా రష్మిక మందన నటిస్తుండగా గంధపు చెక్కల స్మగ్లర్ అదే రీతిలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.