Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూర్తిగా పాన్ ఇండియన్ సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ప్రస్తుతం ఓ లాంగ్ షెడ్యూల్ జరుగుతోంది. సునీల్, ఫాహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మారేడుమిల్లిలో చిత్రీకరణ సాగుతోంది. 5 భాషల్లో రిలీజ్ కానున్న దీనికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా పుష్ప తర్వాత కూడా పాన్ ఇండియా మూవీస్ నే చేయాలని అల్లు అర్జున్ ఫిక్సైయ్యాడు. అందుకే నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ ఏఆర్ మురగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను, కొరటాల శివ, లాంటి స్టార్ డైరెక్టర్స్తో చర్చలు సాగిస్తున్నాడట. రీసెంట్ గా అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడించాడు. కానీ అల్లు అర్జున్ ముందు ఎవరితో సినిమా ఓకే చేశాడు..ఆ తర్వాత ఎవరు..అనేది మాత్రం తెలుపలేదు. దాంతో అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Pushpa : ‘ఐకాన్’ అవగానే మళ్ళీ ‘పుష్ప పార్ట్ 2’ చేయడానికి రెడీ అవుతాడట అల్లు అర్జున్.
పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయనున్నాడట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘ఐకాన్’ కథని పాన్ ఇండియా స్క్రిప్ట్ గా మార్చే పనిలో చిత్ర బృందం ఉందట. ‘ఐకాన్’ అవగానే మళ్ళీ ‘పుష్ప పార్ట్ 2’ చేయడానికి రెడీ అవుతాడట అల్లు అర్జున్. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. గతంలో అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూర్తిగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది.