Eye Sight: బాదం తినడం
ఈ కాలం లో ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ టైం పెరిగి చిన్న పిల్లల దగ్గరనుంచి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. చూపు తగ్గిపోతుంది. దీంతో చిన్న వయస్సు నుండే అద్దాల సహాయం తీసుకోవాలిసిన పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కళ్లను కాపాడుకోవచ్చు. ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
బాదం పప్పులు తినడం వలన మెదడుతో పాటు కళ్ళకు కూడా మంచి శక్తిని ఇస్తాయి. బాదం లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండడం తో పాటు.. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకు చాలా అవసరం. రోజూ 10 ఎండుద్రాక్షలు లేదా బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు రక్షణను కల్పించడం తో పాటు కంటి చూపు మెరుగయేలా చేస్తాయి.
రోజ్ వాటర్
రెగ్యులర్ గా క్యారెట్ తినడం వలన కూడా కళ్లకు చాలా మంచి జరుగుతుంది. రోజు తీసుకునే ఆహారంలో కచ్చితంగా క్యారెట్ల ను ఉండేలా చూసుకుంటే, కంటి చూపు పెరుగుతుంది. రోజ్ వాటర్ కంటికి సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కండ్లకలక, కంటి వాపు సమస్యల నుండి బయట పడటానికి ఉపయోగపడతాయి. రోజ్ వాటర్లో శుభ్రమైన దూదిని ముంచి మూసి ఉన్న కనురెప్పలపై మెత్తగా రుద్దుతూ ఉండడం వలన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
తేనే ,ఉసిరి
తేనె మన శరీరానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కంటి చూపును పెంచుకోవడానికి , కంటి ఆరోగ్యం కోసం ఒక టీ స్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్ను రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగాలి. ఇలా చేయడం వలన కంటికి మేలు కలుగుతుంది. తాజా ఉసిరి అన్ని సమయాలలో దొరకదు కాబట్టి,ఉసిరిక పొడిని కూడా వాడుకోవచ్చు.