NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

T Congress: కాంగ్రెస్ పూర్వ పీసీసీలపై మాజీ ఎంపీ పొన్నం సంచలన వ్యాఖ్యలు..!!

T Congress: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హూజూరాబాద్ ఉప ఎన్నికల పంచాయతీ ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. హూజారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పలువురు నేతలు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపునకు రేవంత్ పరోక్షంగా సహకరించాలని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. హూజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపై సమీక్ష జరిపేందుకు గానూ ఏఐసీసీ పిలుపు మేరకు అభ్యర్ధి వెంకట్ బల్మూరుతో సహా 13 మంది నేతలు ఢిల్లీకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఆధ్వర్యంలో హూజూరాబాద్ లో ఓటమిపై సమీక్షలో వాడివేడి చర్చ సాగింది. ఈ సమావేశంలో టీపీసీసీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

T Congress leader Ponnam serious comments on ex pcc chief
T Congress leader Ponnam serious comments on ex pcc chief

T Congress: భట్టిపై వేణుగోపాల్ ఆగ్రహం

ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఈటల కాంగ్రెస్ లోకి రాకుండా కొందరు అడ్డుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనిపై భట్టి వ్యాఖ్యలపై కేసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని నువ్వే చెప్పి ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసి వేణుగోపాల్.

పద్ధతి మార్చుకోకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది

ఈ సందర్భంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుల మధ్య సమన్వయ లోపమే హుజూరాబాద్ లో ఓటమికి కారణమని పేర్కొన్న పొన్నం ప్రభాకర్.. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన నేతలపైనా ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షులుగా చేసిన కే కేశవరావు, డీ శ్రీనివాస్ లు రాజ్యసభ పదవుల కోసం కాంగ్రెస్ కు మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బంధువు పాడి కౌశిక్ రెడ్డి పార్టీ వీడేందుకు సహకరించి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలు పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని విమర్శించిన పొన్నం…కేవలం హుజూరాబాద్ ఓటమిపైనే కాకుండా నాగార్జునసాగర్, దుబ్బాక ఓటములపైనా సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్ లో కౌశిక్ రెడ్డి పార్టీ వీడితే ఎన్నికల ముందు వరకూ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎందుకు నియమించలేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju