NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

KCR Jagan: చాలా రోజుల తరువాత ఈ ఇద్దరు సీఎంలు కలిశారు..!! విశేషం ఏమిటంటే..?

KCR Jagan: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసిఆర్, వైఎస్ జగన్మోహన రెడ్డి మళ్లీ కలిశారు. ఏపి, తెలంగాణ జల వివాదాల తరువాత ఈ ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. సీఎంలు కేసిఆర్, వైఎస్ జగన్ పక్కపక్కనే కూర్చుని చాలా సేవా కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహ వేడుక ఇందుకు వేదిక అయ్యింది. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి, రోహిత్ రెడ్డిల వివాహం జరిగింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వద్ద ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే వరుడు రోహిత్ రెడ్డి. ఈ కారణంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మ, ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి తదితర ఏపికి చెందిన ప్రముఖులు ఈ వివాహా వేడుకకు హజరై వధూవరులను ఆశీర్వదించారు. మరో పక్క హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హజరైయ్యారు.

KCR Jagan attends telangana speaker pocharam srinivas reddy grand daughter marriage
KCR Jagan attends telangana speaker pocharam srinivas reddy grand daughter marriage

KCR Jagan: జల వివాదం తరువాత..

గతంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇదే ప్రధమం. జల వివాదాల మరో సారి తెరపైకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం కేసిఆర్ హజరు కావాల్సి ఉండగా ఆయన తరుపున హోంశాఖ మంత్రి, సీఎస్ లు హజరైయ్యారు. దీంతో ఈ ఇద్దరు సీఎంలు తారసపడలేదు. తాజాగా ఈ ఇద్దరు సీఎంలు ఒకే వేదిక పంచుకోవడం విశేషం.

ఒకే వేదికపై జగన్, కేసిఆర్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. ప్రధానంగా నీటి సమస్యతో పాటు విభజన చట్టంలోని పలు అంశాలు పరిష్కారం కాలేదు. ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిల అంశాలు ఉన్నాయి. గతంలో సఖ్యతగా ఉన్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎక్కడ తేడా వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కొనసాగుతున్నాయి. మరో పక్క ఏపి, తెలంగాణ అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ తరుణంలో కేసిఆర్, వైఎస్ జగన్ లు ఒకే వేదిక పంచుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకోంది.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N