NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: లోక్ సభలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తావన..! ఎంపీలు రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి మాటల యుద్ధం..!!

YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్ లో అమరావతి రైతుల మహా పాదయాత్ర గురించి రెబల్ ఎంపి రఘురామ ప్రస్తావించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రఘురామ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు ఆయన వ్యాఖ్యలకు అడ్డు చెప్పారు. హైకోర్టు అనుమతితో రైతులు పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని రఘురామ అన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిది అయినా అక్కడ క్షీణించాయని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ ఆరోపించారు. రఘురామ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి రఘురామ వ్యాఖ్యలను ఖండించారు. సీబీఐ కేసుల నుండి బయటపడేందుకు ఎంపి రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసులను వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయనీ, సీఎం జగన్ పై వంద సీబీఐ కేసులు ఉన్నాయనీ, ముందు వాటి సంగతి తేల్చాలని అన్నారు.

lok sabha YSRCP mps
lok sabha YSRCP mps

YSRCP: అమరావతి రైతుల మహా పాదయాత్ర

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతాంగం న్యాయస్థానం నుండి దేవస్థానం (అమరావతి నుండి తిరుమల) పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వీరి పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అటు పోలీసులు, ఇటు పిటిషన్ల తరపున వాదనలు విన్న హైకోర్టు.. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తూ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. పోలీసు బందోబస్తు నడుమ అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రకాశం, నెల్లూరు జిల్లా మీదుగా చిత్తూరు జిల్లాకు ప్రవేశించనున్నది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తి అవ్వగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N