NewsOrbit
రాజ‌కీయాలు

మురళీ మోహన్‌పై కేసు నమోదు

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రెండు కోట్ల రూపాయల వ్యవహారంలో సినీ నటుడు, రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీ మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సజ్జనార్ చెప్పారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామనీ ఆయన అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, ఆరుటి పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రెండు కోట్ల రూపాయల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని సజ్జనార్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటిఎస్‌లో సికింద్రాబాద్‌కు, అక్కడి నుంచి రైలులో రాజమహేంద్రవరం వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.

రాజమహేంద్రవరంలో యలమంచిలి మురళీ కృష్ణ అనే వ్యక్తి మీ కోసం ఎదురు చూస్తుంటాడనీ, ఆయన కారులో ఈ డబ్బులు తీసుకెళ్లి ఎంపి మాగంటి మురళీ మోహన్‌కు ఇవ్వండనీ జయభేరి సంస్థకు చెందిన ధర్మారాజు, జగన్మోహన్ చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరిలు అంగీకరించారని సజ్జనార్ తెలిపారు.

ఈ నేపథ్యంలో టిడిపి ఎంపి మురళీ మోహన్, యలమంచిలి మురళీ కృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదుచేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.

మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

Leave a Comment