Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ ఈరోజు ఉదయం ఏపీ పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం తో…”బీమ్లా నాయక్” సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేయడం జరిగింది. సినిమా నిర్మాణ సంస్థ సితార బ్యానర్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో… వేడుక జరగాల్సి ఉంది.
కానీ ఊహించని విధంగా ఏపీ మంత్రి చనిపోవడంతో.. ఇటువంటి సమయంలో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక చేయటం అంత భావ్యం కాదని సినిమా యూనిట్ ఆలోచన చేయడం జరిగిందట. ఇక ఇదే సమయంలో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ఆయన మృతికి గౌరవ సూచకంగా “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినట్లు… సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుక ఏదైనా పర్లేదు గాని ట్రైలర్ మాత్రం సమయానికి రిలీజ్ చేయండి అని వేడుకుంటున్నారు. ఫస్ట్ టైం పవన్ రానా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ నటించిన సినిమా వస్తూ ఉండటంతో కూడా ఫుల్ కోలాహలంగా వాతావరణం క్రియేట్ అయింది. “బీమ్లా నాయక్” వాస్తవానికి సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ కావాల్సింది. అయితే అప్పట్లో కరోనా కేసులు పెరగటంతో… సినిమా వాయిదా పడింది. మరోసారి ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడటంతో.. పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.