Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు విచారణ పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిల్ అంశాలు అన్నీ కూడా కడప జిల్లా కోర్టులోనే జరిగే విధంగా ఆదేశించారు.
Breaking: నిందితులకు సీబీఐ చార్జిషీటు పత్రాలు అందజేత
అంతకు ముందు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను, కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డిలను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హజరుపర్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హజరుకాలేదు. శివశంకరరెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీబీఐ చార్జిషీటులో పేర్కొన అభియోగాల వివరాలను పులివెందుల మెజిస్ట్రేట్ నిందితులకు అందజేశారు.