Janhvi Kapoor: జాన్వికపూర్ పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి – బోణి కపూర్ ముద్దుల కూతురు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే గత కొన్నాళ్లుగా నటి జాన్వీ కపూర్ జూనియర్ NTRతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉప్పెన అనే సినిమాతో సెన్సెషన్ సృష్టించిన బుచ్చిబాబు సనా ఆ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Jhanvi Kapoor : నెట్టింట్లో వైరల్ అవుతున్న జాన్వి ఫోటో..!!
Janhvi Kapoor: ఇందులో నిజమెంత?
ఇక అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ సినిమాకి బోనీ కపూర్ నిర్మాత అనే సంగతి తెలిసినదే. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందులో ఓ విలేకరి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా దానికి బదులుగా బోని కపూర్ ఈ విధంగా స్పందించాడు. “అది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న పుకారు మాత్రమే. సోషల్ మీడియా అనేది ఓ విచిత్రమైన ప్రపంచం. రోజూ అక్కడ ఓ కొత్త రూమర్ పుట్టుకొస్తూ ఉంటుంది. NTR సినిమాలో జాన్వీ నటిస్తుందనేది కూడా అలాంటి ఒక రూమరే” అని బోనీ కొట్టి పారేసారు.
Jhanvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు తెలుగు ఎంట్రీ.. దర్శకుడు ఎవరో తెలుసా..
బోని చెప్పిన వివరాలు:
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవికి కోట్లమంది అభిమానులు ఉండటం ఎంతో శోచనీయం అని అన్నారు. అందువలనే జాన్వీ తెలుగు సినిమాలో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఇక ఆ అవకాశం మన జూనియర్ తో అయితే అందరికంటే ముందుగా నేనే సంతోషిస్తానని అన్నారు. ఇక్కడి అభిమానులు వారికి ఎంతో ప్రత్యేకం అని, అందరి కోరిక మేరకు కచ్చితంగా టాలీవుడ్ సినిమాలో తను నటించాలని కోరుకుంటున్నాను అని బోనీ స్పీచ్ ముగించారు.