Children : సంతాన సాఫల్య కేంద్రాలకు:
ఆధునిక కాలంలో వేధిస్తున్న సమస్యలలో ప్రధానమైన సమస్య సంతానలేమి . పిల్లలు లేని దంపతులను సమాజం అస్తమానం వేధిస్తూనే ఉంటుంది. ఈ కారణం గానే సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ చికిత్సలకు లక్షల్లో ఖర్చు పెట్టవలిసి ఉంటుంది. పిల్లలు పుట్టేందుకు అంత ఖర్చు పెట్టాల్సిన పని ఏమాత్రం లేదంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. ఒక్క వందరూపాయిలతో ఈ మందు వాడితే చక్కని ఫలితం ఉంటుంది అంటున్నారు.
Children : క్రమం తప్పకుండా గోధుమ గడ్డి :
ఈ వంద రూపాయల చికిత్స గురించి తెలుసుకుందాం. దంపతులకు సంతానం కలగపోవడానికి ప్రధాన కారణం పీసీఓడీ సమస్య ఉండటమే. స్త్రీలకు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఒక క్రమం అనేది లేకపోవడం,గర్భసంచీలో ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ముఖ్య కారణాలు గా చూడవచ్చు. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.అయితే ఈ సమస్యల కు ప్రకృతిలో అనేక ఔషధాలు ఉన్నాయి అని తెలియచేస్తున్నారు ప్రక్రుతి వైద్య నిపుణులు రామచంద్ర. సంతానం లేని దంపతులు క్రమం తప్పకుండా గోధుమ గడ్డి రసం తాగాలని సూచిస్తున్నారు. 8 రోజుల వరకు పెంచిన గోధుమ గడ్డి యొక్క రసం తాగడం వల్ల పై సమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయట. ఇందు కోసం ఒక కేజీ గోధుమలు తీసుకోవాలి ఇవి 60-70 రూపాయలు అవుతాయి. ఒక కేజీ నెల రోజులు వస్తాయని తెలియచేస్తున్నారు.
ఈ ఔషధాల గురించి తెలియక:
వీటితో పాటు పునర్నవ ఆకు యొక్క రసం కూడా తాగడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయంటున్నారు. ఈ పునర్నవ ఆకు గ్రామాల్లో అయితే ఎక్కడపడితే అక్కడ దొరుకుతుందని డాక్టర్ తెలియచేస్తున్నారు. కొంచెం శ్రమ అయినా కూడా పట్నాల్లో ఉండేవారు ఆ మొక్కల్ని కుండీల్లో పెంచుకునే రేపాటు చేసుకోవచ్చు. ప్రకృతి ప్రసాదం అయినా ఈ ఔషధాల గురించి తెలియక లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు.. ఇక మీదట అయినా వాటిని వాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీకు వీటి మీద ఏమైనా సందేహం ఉంటే మీదగ్గర లో ఉండే ప్రకృతి వైద్యనిపుణులని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకొండి,