Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి.. ఈ పేరు తెలియని వారుండరు. `స్టూడెంట్ నంబర్ 1` సినిమాతో దర్శకుడిగా సినీ కెరీర్ స్టార్ చేసిన రాజమౌళి.. అంచలంచలుగా ఎదుగుతూ అపజయం ఎరుగని దర్శకధీరుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తే స్థాయికి ఎదిగారు.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న రాజమౌళి తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్గా నటించారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి తాజాగా గల్ఫ్ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా తాను సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదగడానికి కారణం ఏంటో తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ.. `ఓటమి భయమే తనను పెద్ద కల కనేలా చేస్తుంది. నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా అది నా మునుపటి సినిమాను మించి ఉండాలి. అందుకే, నా సినిమాలో మ్యాజిక్ను సృష్టించాలనే భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ భయం వల్లే నేను సక్సెస్ అవుతున్నా, ఆ భయం వల్లే నేను మరింత ఉత్తమంగా పని చేస్తున్నా` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడీయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!