Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది.
పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ తన సహజ నటనతో అదరగొట్టేశారు. తన జీవితంలో ప్రేమ, పెళ్లి లేవని నమ్మే విక్రమాదిత్య.. ప్రేరణ(పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. కానీ, విధి వీరిని వేరు చేస్తుంది. మరి ఆ విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.
కథ రొటీన్గానే ఉన్నా.. విజువల్స్, లొకేషన్స్ ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తాయి. మొత్తానికి టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇకపోతే థియేటర్లో విడుదలైన సినిమాలు.. కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్పై ఓ ఇంట్రస్టింగ్ టాక్ జోరుగా వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాధేశ్యామ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందట. థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల అనంతరం అంటే ఏప్రిల్ 11 నుంచీ స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచే రాధేశ్యామ్ను అమెజాన్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.