petrol diesel price భారత్ లో పెట్రో వడ్డన కొనసాగుతోంది. 14 రోజుల్లో 12 సార్లు ధరలు పెరిగాయి. లీటరుకు రూ.8.40లు రెండు వారాల్లో పెరిగింది. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో సామాన్య, మద్య తరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 40 పైసలు వంతున పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో .. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.81 లకు, డీజిల్ లీటరు రూ.94.07కి చేరుకుంది.
petrol diesel price: తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53లకు పెరగ్గా డీజిల్ ధర 103.60లకు పెరిగింది. కరీంనగర్ లో లీటరు పెట్రోల్ ధర రూ.117.71లు, డీజిల్ ధర రూ.103లకు చేరింది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.118.55కి చేరగా, డీజిల్ ధర రూ.105.90 కి పెరిగింది. విశాఖలో పెట్రోల్ ధర రూ.118.02లు చేరగా, డీజిల్ ధర రూ.104 46లకు చేరింది. ఓ పక్క పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.