CM YS Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టు కు నిధులు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించనున్నారని సమాచారం.
Read More: AP New Districts: 13 కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించిన సీఎం జగన్
CM YS Jagan Delhi Tour: రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై
ఇదే సందర్భంలో రాష్ట్రంలో జిల్లాల పునర్భిభజన జరిగిన విషయాన్ని వివరించడంతో పాటు తాజా రాజకీయ కొత్త జిల్లాలలో అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులకు వినతి పత్రం సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఏపి సీఎం వైఎస్ జగన్ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ సీఎం కేసిఆర్ కంటే ముందుగా జగన్ కు పీఎం మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడం విశేషం. కాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో బేటీకి కూడా సీఎంఓ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.