Gopichand: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ లొకేషన్లో ఓ ఎత్తైన ప్రదేశం నుంచి ఆయన కాలు జారి కింద పడిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలె మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్షియల్` సినిమాను పూర్తి చేసుకున్న గోపీచంద్.. తన తదుపరి ప్రాజెక్ట్ను డైరెక్టర్ శ్రీవాస్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది గోపీచంద్కు 30వ సినిమానే కాదు.. శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన హ్యాటిక్ మూవీ కూడా. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు మంచి విజయం సాధించడంతో.. ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం మైసూర్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ ప్రమాదం బారినపడ్డారు. ఓ కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ప్రమాదవశాత్తు గోపీచంద్ కాలు జారీ ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడిపోయారట. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీవాస్ స్వయంగా వెల్లడించారు.
అయితే అదృష్టం కొద్ది గోపీచంద్కు ఎలాంటి గాయాలు అవ్వలేదని.. ఆయన ఆయన క్షేమంగానే ఉన్నారని శ్రీవాస్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇక ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొనడం వల్లే గోపీచంద్కు ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఏదేమైనా గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.