Sai Pallavi: ప్రముఖ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఫిదా` మూవీతో గ్రాండ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
ఇటీవల లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. తర్వలోనే `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. అలాగే ఈ మధ్య `గార్గి` అనే మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మూవీ కోసం సాయి పల్లవి దొంగలా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయం ఏంటంటే.. మొన్నామధ్య తాను నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా బుర్ఖా వేసుకొని థియేటర్లో ప్రేక్షకుల నడుమ దొంగచాటుగా చూసొచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` మే 12న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాను థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలని భావించిన సాయి పల్లవి.. ముఖమంతా కవర్ అయ్యేలా స్కార్ప్ తో కప్పేసి, ముక్కు.. మూతిని మాస్క్ తగిలించి హైదరాబాద్ లోని పీవీకే ఆర్కే సీని మల్టీప్లెక్స్ లో సినిమాను వీక్షించింది. ఆపై అటు ఇటూ చూసుకుంటూ ఎవరూ గుర్తు పట్టకుండా కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. సాయి పల్లవి చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!