Elon Musk: అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసుకునేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫేక్ ఖాతాల విషయంలో కిరికిరి నెలకొనడంతో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. ఫేక్ ఖాతాల విషయంలో ఎలాన్ మస్క్ అనుమానాల కారణంగా ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం విషయంలో బ్రేక్ పడే సూచనలు కనబడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చే విధంగా ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Elon Musk:ఫేక్ ఖాతాల సంఖ్య తేలిన తర్వాతే..
ట్విట్టర్ కొనుగోలు అంశంకు సంబంధించి ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లో ఫేక్/స్పామ్ ఖాతాలు మొత్తం యూజర్ల సంఖ్యలో అయిదు శాతం కంటే తక్కువ ఉన్నాయని నిరూపించకపోతే ఆ సంస్థ కొనుగోలు ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కష్టమని పేర్కొన్నారు ఎలాన్ మస్క్. షేక్ యూజర్ల సంఖ్య అయిదు శాతం కన్నా తక్కువే ఉండవచ్చని ట్విట్టర్ చెబుతుండగా, అది 20 శాతం ఉండవచ్చని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకూ ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు మస్క్.
తాత్కాలిక బ్రేక్..?
“ట్విట్టర్ లో 20 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉండొచ్చు. ట్విట్టర్ సంస్థ చెబుతున్న దానికి ఇది నాలుగు రెట్లు ఎక్కువ. అయిదు శాతం కన్నా తక్కువే స్వామ్ ఖాతాలు ఉన్నాయని బహిరంగంగా రుజువు చేయడానికి ట్విట్టర్ సీఈఓ నిరాకరించారు. ఆయన రుజువు చేసే వరకు డీల్ ముందుకు సాగదు” అని మస్క్ తాజాగా పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలోనూ వెల్లడించారు మస్క్. ట్విట్టర్ కు తాను ముందుగా ప్రకటించిన 44 బిలియన్ డాలర్ల కన్నా తక్కువకే చెల్లించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఫేక్/స్పామ్ ఖాతాల విషయంలో నెలకొన్న పేచీ (కిరికిరి) కారణంగా ఈ కొనుగోలు అంశంలో తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయ్యింది.
20% fake/spam accounts, while 4 times what Twitter claims, could be *much* higher.
My offer was based on Twitter’s SEC filings being accurate.
Yesterday, Twitter’s CEO publicly refused to show proof of <5%.
This deal cannot move forward until he does.
— Elon Musk (@elonmusk) May 17, 2022