YSRCP Rajya Sabha: ఏపి రాజ్యసభ అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ఖరారు చేశారు. విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఈ నలుగురు నేతలు తొలుత సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనంతరం రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు మీడియాకు వెల్లడించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP Rajya Sabha: బడుగు బలహీనవర్గాలకు పెద్ద పీట
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో ముఖ్యనేతలతో సంప్రదించిన తరువాత పేర్లను ఖరారు చేసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరో సారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమం సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీదా మస్తాన్ రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైసీపీది ఒకటే దారి అని, జనాభా దామాషా మేరకు బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామని చెప్పారు. ఈ నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు బీసీ నేతలని చెప్పారు. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు సజ్జల.