NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atmakur By Poll: ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్.. పోలింగ్ శాతం ఎంత అంటే..?

Atmakur By Poll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ 61.75 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఆరు గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటింగ్ కు అనుమతి ఇచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల తరవాత కూడా క్యూలైన్ లలో ఓటర్లు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల సమయానికే ఖాళీగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలను అధికారులు మూసివేసి ఈవీఎంలను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. పలు పోలింగ్ కేంద్రాల సమీపంలో వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Atmakur By Poll ended peacefully
Atmakur By Poll ended peacefully

ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, జనసేన లు పోటీలో లేకపోవడంతో వైసీపీ మెజార్టీ అంచనాలపైనే లెక్కలు వేసుకుంటోంది. ఎన్నికల బరిలో వైసీపీ, బీజేపీతో సహా 14 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా భరత్ కుమార్ యాదవ్ లు రంగంలో ఉన్నారు. వైసీపీ ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీని సాధించాలన్న లక్ష్యంతో ఉంది. 70 శాతంకుపైగా పోలింగ్ నమోదు అవుతుందని వైసీపీ వర్గాలు భావించినా 62, 63 శాతం మించే పరిస్థితి లేదు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, స్వతంత్ర అభ్యర్ధి శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

 

ఉప ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్ విష్ణును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ, ఎలక్షన్ కమిషనర్ కు దృష్టికి తీసుకువెళ్లినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ప్రజలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు పోలీసులపై ఎదురుదాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ వెంటనే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద పోలింగ్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella