NewsOrbit
రాజ‌కీయాలు

ఫిరాయింపు ఆపేదెలా!

హైదరాబాద్: మొన్నటి ఎన్నికలలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన  అనుభవంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది.

పార్టీ తరుపున పోటీ చేయాలంటే గెలిచాక పార్టీ మారబోమని అభ్యర్థులు బాండ్ పేపర్‌పై హామీ రాసివ్వాలి. ఒకవేళ పార్టీ మారితే కేసు పెట్టుకునేలా అంగీకారాన్ని అందులో పొందు పరచాలి.

స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలు బుధవారం గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరుగుతున్నది.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మండల పరిషత్, జడ్పి చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తాము సెలెక్ట్-ఎలెక్ట్ పద్దతిని ప్రవేశ పెడుతున్నామనీ, ప్రజలే అభ్యర్థిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇస్తున్నామనీ ఉత్తమ్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

అలాగే పోలీసు శాఖ, టిఆర్‌ఎస్‌పై ఉత్తమ్ విమర్శలు చేశారు. పోలీసులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. మంద కృష్ణ మాదిగను హౌస్‌ అరెస్ట్‌ చేయడం నిరంకుశమేనని ఉత్తమ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహ కూల్చివేత అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతాం అని ఉత్తమ్ తెలిపారు. అంబేద్కర్‌ను ప్రభుత్వం అవమానించిందని ఉత్తమ్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఉత్తమ్ మండిపడ్డారు. ఆయనకి పార్టీ మద్దతు ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Leave a Comment