భోపాల్: మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బుధవారం బిజెపిలో చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్తో తలపడనున్నారు.
2008 సెప్టెంబర్ 29న మాలెగావ్లో జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు.
ఈ కేసులో సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ను నిందితురాలిగా అరెస్టు చేశారు. పదేళ్ల పాట జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.
ఉద్వేగపూరిత, వివాదాస్పద ఉపన్యాసాలు ఇవ్వడంలో పేరుగాంచిన ప్రజ్ఞ సింగ్ ఠాకూర్ బిజెపి అనుబంధ సంస్థలైన విధ్యార్థి విభాగం ఎబివిపి, మహిళా విభాగం దుర్గా వాహిని, విశ్వహింధూ పరిషత్ (విహెచ్పి) లో క్రియాశీలకంగా పని చేశారు.
భోపాల్ స్థానం నుండి తాను తప్పకుండా విజయం సాధిస్తానని ఈ సందర్భంగా సాద్వి విశ్వాసం వ్యక్తం చేశారు.