పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” నిన్న విడుదలయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం బాగా కష్టపడినా గాని పూరి జగన్నాథ్ మార్క్ సినిమాలో కనిపించలేదని టాక్ నడుస్తోంది. పూరి క్యారెక్టర్జేషన్ హీరో.. గతంలో పలు సినిమాలలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో.. అందరికీ తెలుసు. కానీ “లైగర్” ఆ తరహాలో లేదని అసలు సినిమాలో సాంగ్స్ ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో అర్థం కాదు ఇదే సమయంలో హీరోయిన్ పాత్ర దేనికి పెట్టారు అన్నది కూడా సినిమా చూశాక ప్రశ్నార్థకంగా ఉంటుందని జనాలు చెప్పుకూరావటం జరిగింది.
దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డ విజయ్ దేవరకొండ కి ఫలితం నెగిటివ్గా రావడం పట్ల అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు. పైగా వరుసపరాజయాలలో ఉండటంతో…”లైగర్” రిజల్ట్ దారుణంగా రావడంతో చాలా బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొదట విజయ్ దేవరకొండకి చెప్పకముందు ముగ్గురు హీరోలకు పూరీ జగన్నాథ్ చెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది.
ఆ హీరోలు మరెవరో కాదు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అంట. ఈ సినిమా స్టోరీ చెబుతున్న టైంలో మిగతా ప్రాజెక్టులలో డేట్స్ ఉండిపోవటంతో వీళ్లు ఈ “లైగర్” నీ ఒప్పుకోనట్టు సరికొత్త వార్త వినపడుతుంది. ఈ గ్రామంలో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో బతికిపోయారు ముగ్గురు సరిగ్గా ఇప్పుడు వీళ్ళకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంది. “లైగర్” చేసుంటే గ్రాఫ్ పడిపోయేది అని నేటిజెన్ లు కామెంట్లు చేస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!