అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ బడా నిర్మాత బోని కపూర్ దంపతుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది.. త్వరలోనే ఈ బ్యూటీ `మిల్లీ` అనే సర్వైకల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. నవంబర్ 4న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో జాన్వీ కపూర్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇదిలా వంటే జాన్వీ కపూర్ తాజా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. హాట్ హాట్ అందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాని షేక్ చేసే జాన్వీ కపూర్.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.
టైట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ లెహంగా చోళీ ధరించిన జాన్వి కపూర్.. చూసినోళ్లకు చూసినంత అన్న రేంజ్ లో పరువాల విందు చేసింది.
జాన్వి కపూర్ అందాలకు నెటిజన్లు ఆగమాగం అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పిక్స్ పై లైక్ లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో `మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `బవల్` చిత్రాలు ఉన్నాయి. వీటి షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.