NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఏపిలో దూకుడు పెంచిన వైసీపీ.. మొన్న బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనం .. నేడు కాపు ప్రజా ప్రతినిధులు భేటీ

YSRCP:  ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు ఇంకా 18 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సిద్దంగా కావాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాడర్ కు సూచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాలపై సమీక్ష లు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు విధిగా ప్రజల్లో తిరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రీసెంట్ గా బీసీ నేతల ఆత్మీయ సమావేశాన్ని వైసీపీ నిర్వహించింది. బీసీల సంక్షేమం, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, బీసీ నేతలకు పార్టీలో, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర విషయాలపై నేతలు మాట్లాడటంతో పాటు ఈ విషయాలను బీసీ వర్గాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

YSRCP

 

తాజాగా ఈ రోజు రాజమండ్రిలో మంజీరా కన్వెన్షన్ హాలు నందు వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, దాడిశేట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వైసీపీలో 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉండగా, రెడ్డి సామాజిక వర్గంతో సమానంగా మంత్రి పదవులు ఇచ్చారనీ, కాపులకు వైసీపీలో అత్యంత ప్రాధాన్యతను సీఎం జగన్ ఇస్తున్నారనీ, కాపుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నారని నేతలు ఉన్నారు.

 

గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలపడుతున్నదని, టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్న తరుణంలో రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై కొందరు వైసీపీ నేతలే కౌంటర్ అటాక్ చేశారనీ, కొందరు తీవ్రంగా స్పందించకపోవడంపై పార్టీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనేేందుకు, కాపు సామాజిక వర్గ ఓటర్లను జనసేన వైపు మళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని వార్తలు వినబడుతున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారని సమాచారం.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella