NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఏపిలో దూకుడు పెంచిన వైసీపీ.. మొన్న బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనం .. నేడు కాపు ప్రజా ప్రతినిధులు భేటీ

YSRCP:  ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు ఇంకా 18 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సిద్దంగా కావాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాడర్ కు సూచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాలపై సమీక్ష లు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు విధిగా ప్రజల్లో తిరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రీసెంట్ గా బీసీ నేతల ఆత్మీయ సమావేశాన్ని వైసీపీ నిర్వహించింది. బీసీల సంక్షేమం, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, బీసీ నేతలకు పార్టీలో, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర విషయాలపై నేతలు మాట్లాడటంతో పాటు ఈ విషయాలను బీసీ వర్గాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

YSRCP

 

తాజాగా ఈ రోజు రాజమండ్రిలో మంజీరా కన్వెన్షన్ హాలు నందు వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, దాడిశేట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వైసీపీలో 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉండగా, రెడ్డి సామాజిక వర్గంతో సమానంగా మంత్రి పదవులు ఇచ్చారనీ, కాపులకు వైసీపీలో అత్యంత ప్రాధాన్యతను సీఎం జగన్ ఇస్తున్నారనీ, కాపుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నారని నేతలు ఉన్నారు.

 

గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలపడుతున్నదని, టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్న తరుణంలో రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై కొందరు వైసీపీ నేతలే కౌంటర్ అటాక్ చేశారనీ, కొందరు తీవ్రంగా స్పందించకపోవడంపై పార్టీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనేేందుకు, కాపు సామాజిక వర్గ ఓటర్లను జనసేన వైపు మళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని వార్తలు వినబడుతున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారని సమాచారం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju