NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: టీ కాంగ్రెస్ సీనియర్ ల వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈసీ భేటీకి ఆ 9 మంది సీనియర్లు డుమ్మా.

Revanth Reddy:  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమవేశం ఆదివారం జరిగింది. హాత్ మే హాత్ జోడో కార్యక్రమంపై ఈ సమావేశం లో నేతలు చర్చించారు. టీపీసీసీ కమిటీ నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతలు ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు రాజనర్శింహ, మధుయాష్కీ, కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఈ సమావేశానికి గైర్హజరు అయ్యారు. నిన్ననే వీరంతా సమావేశమై రేవంత్ నాయకత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Revanth Reddy

కాగా టీపీసీసీ ఈసీ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పై సమావేశంలో చర్చించామన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మోడీ, కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగతామని చెప్పారు. ఇది క్రమంలో సోషల్ మీడియాలో సీనియర్ లపై దుష్ప్రచారం జరుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీపీ ఆనంద్
ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఐపీఎస్ అధికారా లేక ఒక పార్టీ కార్యకర్తనా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అని రేవంత్ వ్యాఖ్యానించారు.

తీన్మార్ మల్లన్న ఎవరో తనకు తెలియదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆయన ఎవరినో తిడితే నాకేమిటి సంబంధం అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తిడితే వాళ్లను చెప్పుతో కొట్టండి కానీ తనపై అనవసరంగా విమర్శలు చేయవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఎవరెవరో పెట్టిన పోస్టులకు తనకు ఆపాదించవచ్చని హితవు పలికారు. పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చూడవద్దని హితవు పలికన రేవంత్ రెడ్డి.. ప్రజా సమస్యలతో పోల్చుకుంటే పార్టీలో సమస్యలు పెద్దవి ఏమీ కావని అన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరో పక్క జనవరి 26వ తేదీ నుండి జూన్ రెండో తేదీ వరకూ తెలంగాణలో పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ యాత్రను ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను పీసీసీ విడుదల చేసింది. తెలంగాణలో ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు ఈ యాత్రను చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది.
టీ కాంగ్రెస్ లో ముదురుతున్న సంక్షోభం .. పీసీసీ కమిటీలకు 12 మంది రాజీనామా

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?