హైదరాబాదు: అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని రాజీనామా చేయాలనీ, బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ధర్నాకు దిగారు.
ఈ ధర్నా శిబిరాన్ని సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితర నేతలు సందర్శించారు. పోలీసులు ధర్నా శిబిరం వద్దకు చేరుకుని దత్తాత్రేయతో సహా బిజెపి నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా తమను పోలీసులు అరెస్టు చేయడం మంచిపద్దతి కాదని అన్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాపితంగా నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా దత్తాత్రేయ తెలిపారు.
మరో పక్క బిజెపి నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!