జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. నిలకడ లేని మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఓ పక్క బీజేపీతో అంటకాగుతూ మరో వైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో..ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మంత్రి సురేష్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు నిలబడి చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతున్నామన్నారు.
టీడీపీ నాయకులు వాపుని చూసి బలుపు అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలన్నారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు లేరనీ, అందుకే పొత్తులకు వెళ్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సీమెన్స్ స్కామ్ బయటపడిందనీ, దీనిలో 300 కోట్ల కుంభకోణం జరిగిందనీ, ఈ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చారని, ఏపి లో షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు బస్సు బొల్తా .. గాడ్ గ్రేస్ .. ప్రయాణీకులు అంతా సేఫ్ ..ఎక్కడంటే..?