NewsOrbit
న్యూస్

రెండో వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఆయన జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించగా, ఇప్పుడు రెండో ట్రైన్ ను ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభ వార్తే. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు తక్కువ సమయంలో, ఉల్లాసంగా ప్రయాణం చేస్తూ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే సికింద్రాబాద్ నుండి తిరుపతికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రధాని మోడీ తొలుత రైలులో విద్యార్ధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train
PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train

 

తొలుత బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మోడీ ప్రత్యేకంగా కైసే హో.. సంజయ్ అని అప్యాయంగా పకలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల బండి సంజయ్ ను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు తరలించడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన సంజయ్ ప్రధాని మోడీని స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు మొత్తం 32 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను అనుమతించారు.

PM Modi Bandi sanjay

 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రిమోట్ ద్వారా అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోడీ .. రూ.7,850 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అయిదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju