ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా, మరో వెయ్యి మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు సీబీఐతో దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తి అయ్యాయని పేర్కొన్న కేంద్ర మంత్రి .. పునరుద్దరణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోందని ఆయన వివరించారు.
తొలుత కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ .. ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమో.. వ్యవస్థలోని లోపాలో కారణం కాదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించటం, ఎలక్ట్రానిక్స్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఘోర రైలు ప్రమాదానికి కారణాలను, బాధ్యలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్, పాయింట్ మిషన్ లో మార్పుల వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్లు మంత్రి చెప్పారు. అయితే రైల్వే భద్రాత విభాగ కమిషనర్ విచారణ జరుపుతున్నారని మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన తప్పిదంపై నిర్దారణకు రావడమే కాకుండా, ప్రమాదానికి కారకులను కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదిక ను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని, అయితే ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది దర్యాప్తులో బయటపడుతుందని ఆయన తెలిపారు.
మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?