నిన్ను వదల బొమ్మాలీ అన్నట్లు .. మార్గదర్శిపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసిన ఏపీ సీఐడీ .. తాజాగా మరో రూ.242 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మార్గదర్శి కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఏపీ సీఐడీ .. ఆ కంపెనీ యాజమాన్యం రామోజీరావు, శైలజా కిరణ్ లను పలు మార్లు విచారించడం జరిగింది. మర్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారుల, డిపాజిట్ దారుల ప్రయోజనాలే పరిరక్షణే లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు చెబుతోంది సీఐడీ.
ఇంతకు ముందు రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేయగా, వాటిలో మార్గదర్శి చిట్ ఫండ్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్దంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులు ఉన్నాయి. చిట్ ఫండ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చెరుకూరి రామోజీరావు, చెరుకూరి శైలజ కిరణ్ తో పాటు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
విశాఖలో కలకలం .. వైసీపీ ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!