Allu Arjun: భారతీయ చలన చిత్ర రంగంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఓ సంచలనం అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎలాంటి ప్లాట్ ఫామ్ అయినా బన్నీకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ టీం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్. అటువంటి సోషల్ మీడియా దిగ్గజం బన్నీకి ఇంస్టాగ్రామ్ ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది. మేటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ నీ ఇంస్టాగ్రామ్ అండ్ ఫాలో చేయడం జరిగింది. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళ్తే 2021 పుష్ప సినిమాకి ఇటీవల అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు రావడం తెలిసిందే. ఈ అవార్డు వచ్చిన తర్వాత…ఇన్ స్టా టీం హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ పై స్పెషల్ షూట్ చేయడం జరిగింది.
అప్పటినుంచి అతడిని అన్ ఫాలో చేయడం జరిగింది. ఈ ఛాన్స్ అతి కొద్ది మంది స్టార్లకు మాత్రమే దక్కింది. అయితే అల్లు అర్జున్ నీ ఆన్ ఫాలో చేయటం సంచలనంగా మారింది. ఒక్క బన్నీని మాత్రమే కాదు ఆలియా భట్ నీ కూడా ఇన్ స్టా అన్ ఫాలో చేయడం జరిగింది. ఈ రకంగా బన్నీ మరియు ఆలియా భట్ పట్ల ఇన్ స్థా ఎందుకు వ్యవహరించిందో కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. మేకర్స్ అధికార తేదీ ప్రకటించడంతో.. చాలా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే ఈ సినిమాలో కేశవ్ పాత్ర చేస్తున్న జగదీష్ పోలీస్ కేసులో ఇరుక్కోవడంతో సినిమా యూనిట్ ఇప్పుడు అతనిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి నానా తంటాలు పడుతూ ఉంది. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో దానికి మించి అన్న విధంగా రెండో భాగం తీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” మొదటి భాగం అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించటంతో దర్శకుడు సుకుమార్… రెండో భాగం స్క్రిప్టులో చాలా మార్పులు చేసి అందరిని ఆకట్టుకునే విధంగా హీరో క్యారెక్టర్ తీర్చిదిద్దినట్లు ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు.